29, సెప్టెంబర్ 2009, మంగళవారం

some good quotations

1. All love shared is good.
2. Clever man good but they are not the best.
3. Every man is the architec of his own fortune.
4. The happy only are the truely great.
5. A good heart is worth good.
6. Sweet the help of one we have helped.
7. Real beauty is the beauty of soul.
8. Be sure you are right , then go ahead.
9. Love conque all us too yield to love
10.In friendship there should be no prettence.
11.Beauty is a short - lived reign.

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

గరుడోత్సవం

శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన గరుడోత్సవం అత్యంత వైభవం గా జరుగుతున్నది. ఇతర రాష్ట్ర ల నుంచికూడా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.బ్రహ్మా ఆధ్వర్యం లో సకల దేవతలు విచ్చేసి జరిపే ఉత్సవం గనుకనే బ్రమ్హోత్సవం అయింది.ఈ ఉత్సవాల సంధర్బం గా అందరు దేవతలు తిరుమల విచ్చేసి నివసముంటారని భక్తుల విశ్వాసం.సాక్షాత్తు శ్రిమన్నరయనుడే వైకుంఠం వదలి తిరుమలకు వచ్చి కొలువైవుంతడని , బ్రహోత్సవాలను వీక్షిస్తూ భక్తుల కోరికలను తీరుస్తాడని భక్తుల మనోబిప్రాయం.
అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు విక్షేసి స్వామి వారి వైబవాన్ని కనులార దర్శించి పునితులౌతారు.స్వామి వారి వాహన సేవలైన చిన్న శేషు, పెద్ద శేషు , గజ , అశ్వ , హనుమ, గరుడ , కల్పవృక్షం, మత్యాల పల్లకి ,సూర్య ప్రభ , చంద్ర ప్రభ , సింహ , రధోత్సవం మో... అన్ని వాహనాలలో మిక్కిలి ప్రీతి ప్రాయమైన గరుడ వాహనం పై స్వామి వారి వైభవం విక్షించుటకు వెయ్యి కనులైన చాలవు.అత్యంత విలువైన ఆభరణాలతో సర్వాంగ సుందరం గా అలంకరించుకొని తిరుమల గిరిలో విహరించే స్వామి వారి వైభవం చూచువారి జన్మ ధన్యమే కదా.
కనుకనే తిరుమల అన్నా , తిరుమల లడ్డు అన్నా అంతటి ప్రాముఖ్యత.ప్రమోషన్ కావాలన్నా డబ్బుతో జరగని పనులు తిరుమల లడ్డు ఇస్తే జరిగిన సందర్బాలు ఉన్నాయి.

24, సెప్టెంబర్ 2009, గురువారం

ఓ ప్రియ

ప్రియా....
నీ చూపులలో కరగాలని..
నీ ప్రేమలో మునగాలని..
నీ ఉహల్లో ఇమడాలని..
నీ ఉపిరిలో కలవాలని..
నీ మనస్సులో మిగలాలని..
నీ ఒడిలో వాలలని..
నీ చేతిలో చెయ్యి వెయ్యాలని..
నీ అడుగుల్లో అడుగేయ్యలని..
యుగ యుగాలు నీతో గడపాలని
నా చిరుకోరిక...

19, సెప్టెంబర్ 2009, శనివారం

విధ్యార్థులు ____ కళాశాలలు

నేటి విద్య సంస్థలు విద్య కేంద్రాలుగా విరాజిల్లుట లేవు. నేటి విద్యార్థులే రేపటి భారత దేశరూప కర్తలు ఇది ఓ సూక్తి.కాని వాస్తవంగా నేటి విద్యార్థులే రేపటి నేరస్తులుగా ప్రవర్తిస్తున్నారు.ఇది కోపం తో చెబుతున్న విషయం కాదు.వాస్తవం గా జరుగుతున్న పరిణామాలకు వ్యధ చెంది వ్రాస్తున్న కఠోర నిజం.యాసిడ్ దాడి గానిఅమ్మాయల గొంతు కోయడలు గాని, ప్రేమించమంటూ వేధించడం గాని, ఈవే టీజింగ్ గాని అధిక బాగం విధ్యర్తులదే.
అట్లని విధ్యర్తులదే తప్పు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో? వీటిలో విద్యాసంస్థల తీరూ కూడా దోహదం చేస్తున్నాయి.సద్బుద్ధులు నేర్పించవలసిన గురువులు చేసే అనైతిక చర్యలు కూడా ప్రబావం చూపుతున్నాయి.ఉన్నత విలువలతో విరాజిల్ల వలసిన విద్యాలయాలు కుళ్ళు రాజకీయాలతో బ్రష్టుపడుతున్నాయి.రాజకీయ పలుకు బాడితో అర్హత లేకున్నా విద్యాలయాలలో పదవులు తెప్పించుకొని విద్యార్థులతో వర్గాలు ఏర్పరుచుకొని రాజకీయాలు నడుపుతున్నారు.
యునివర్సిత్య్లలో కమిటి లలో విద్యావంతులు ఎవ్వరున్నారు?విద్య వ్యాప్తికి కృషి చేసే వారు ఏరి? పదవులు కాపాడుకోవడానికి విద్యార్థులను రెచ్చగొట్టి ధర్నాలు , గొడవలు చేయించే గురువుల నుంచి మంచిని ఆశించడం అత్యాశ ఏమో?లెక్చరర్ ఉద్యోగానికి ఇంత అని రేట్ పెట్టి ఉద్యోగాలు అమ్ముకొనే విద్యాలయాల కులపతులు , లంచం ఇచ్చి చదువులు చెప్పే లక్చరర్లు వీరి నుంచి నేర్చుకొనే మంచి ఎలా ఉంటుంది? వీరే సంగావిద్రోహులు . వీరిని సంస్కరిస్తే గాని మన విద్యాలయాలు ఉన్నత ప్రమాణాలకు నిలయాలు కాలేవు.
ఓ చిన్న విషయం : ఈ విషయం లో అమ్మాయల పాత్ర ను తక్కువ చేయలేము.అవసరం ఉన్నంత వరకు అబ్బాయల్ని వాడుకోవడం అవసరం తీరాక తప్పిచుకు తిరగటం , నిలదీస్తే గొడవ చేస్తున్నాడని కంప్లైంట్ చేయడం.అందరు ఇలాగె ఉంటారని కాదు, కొంత మంది ఇలా చేస్తున్నారు. కాయిన్ బాక్స్ ఫోన్స్ ఎక్కువ అమ్మయలతోనే బిజీ గా ఉంటాయి. ఎందుకు , ఓ తప్పు ఇద్దరి అంగీకారం తోనే జరుగుతుంది. మరి ఎక్కువ అబ్బాయల్ని మాత్రమే ఎందుకు నిందిస్తారు? వేరెవ్వరి జోలికి వెళ్ళని అబ్బాయి ఆ అమ్మాయి మీదే ఎందుకు ద్వేషం పెంచుకుంటాడు? అమ్మాయి , అబ్బాయల్కి కలిపి కౌన్సిలింగ్ కాలేజీ జాయిన్ అయ్యేతప్పుడే ఇస్తే కొద్ది గా పలితం ఉండవచ్చు.

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

ఆడవారి పై అఘాయిత్యాలు

ప్రేమ పేరు తో ఉన్మాది :ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఒక సంవత్సర కాలం వేధిస్తుంటే విసిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఓ నిర్బగ్యురలిని జైలు నుంచి బెయిల్ పై వచ్చిన ఉన్మాది కత్తితో అమ్మాయి కుటుంబం పై దాడి చేసి అమ్మాయిని తీవ్రం గా గాయపరచి తల్లిదండ్రులను బలితీసుకున్నాడు.(రాజమండ్రి)
మరో ఘోరం: నిత్యం వేధించే భర్తతో విసిగివేసారి విడాకులు కోరిన భార్య పై కోపం తో అందుకు కారణం మరధలనుకొని పట్టపగలు బస్టాండ్ నందు మరదలిని నరికి చంపిన కసాయి.(మిర్యాల గూడెం)
ఒక ఘోరతిఘోరం:తాగుడు మానమని , రోజు పనికి వెళ్ళాలని హితబోధ చేసిన పాపానికి భార్యను అత్యంత ఘోరంగా రెండు కాళ్ళను కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ మృగం .
ఒక కసాయి:మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఇనుప రాడ్ తో తలపై కొట్టి చనిపోయింధనుకొని పోలీస్ కేసు కు భయపడి ఆత్మ హత్య చేసుకున్నాడో ముర్కుడు (శ్రీకాకుళం జిల్లా)
ఇది ఈ రోజు మాత్రమే కాదు.ఇంచుమించు ఇలాంటి వార్తలు ప్రతిరోజు దినపత్రికలలో చూస్తున్నాము. చదివిన క్షణం మాత్రం అయ్యో అనుకుంటాము.పోలీసులు ఏమిచేస్తున్నారు అనుకుంటారు. సమస్య ఎక్కడనుంచి పుడుతుంది ? దీనికి మూలం ఏమిటి ? అని ఎవ్వరు ఆలోచిస్తున్నారు.ప్రతి సంఘటనకు పోలీస్ కేసు అవుతున్నది.శిక్షలు పడుతున్నాయి.కాని నేరాలు అదుపులో ఉన్నాయా?సమస్యకి మూలకారణం తెలుసుకొని అక్కడి నుంచి మార్పూ తెస్తే తప్ప సమస్యలు సమసిపోవు.ప్రభుత్వాలు , కాని పోలీస్ లు కాని దీన్ని క్రైమ్ గా నే పరిఘనిస్తున్నారు. నేరం చేసిన వాళ్ళలో కొద్ది మంది అనుకోకుండా ఆవేశం లో చేసిన చర్యలే.వారి గతం లో ఎలాంటి నేరచరిత ఉండదు.కాని నేరం చేసుంటారు.అలంటి వారికీ కౌన్సలింగ్ చేస్తే మరే ప్రయోజనం ఉండవచ్చు.చిన్న చిన్న నేరాలకు కూడా జైలు శిక్షలు వేస్తున్నందేనే ఇలాగే జైలు చూసాము ఇకేముంది అలాగే ఉండిపోధం అనుకొనే వాళ్లు కూడా ఉన్నారు.అమ్మాయిల్ని టీజ్ చేసే వారికి సమస్య ఇంచుమించు ఇంటిలోనే ఉంటుంది.
తల్లిదండ్రులు సరిగా పట్టించుకోక పోవడం , ఒంటరితనం గా ఫీల్ కావడం , టీవీ కార్యక్రమాలలో టీజ్ చేయడం కూడా హీరోయిజం గా చూపడం , తనతో ఎవ్వరు ఫ్రెండ్ షిప్ చేయకపోవడం ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిల్ని టీజ్ చేస్తూ మానసిక ఆనందం పొందుతారు.వీరికి శిక్షలు కాదు కౌన్సలింగ్ చేసి సమస్యను ఎత్తి చూపితే కొద్దిగా మరే అవకాసం ఉంది.ఎందుకు ఇలా ఆలోచించారు?ఎంతసేపు జైలు , శిక్షలు మాత్రమే ఆలోచిస్తారు?

కోబ్రా తో చిన్ని పాపా

చిన్న పాపా పాముతో అట్లాడటం చుడండి.

17, సెప్టెంబర్ 2009, గురువారం

నిరాశపరచకు నేస్తం

అరవిరిసిన నీ కనుల వెనక
ఆలోచన నీర్విర్యమౌతున్న సమయం లో
ఒక నిశబ్ధం నన్ను విడిచి వెళుతూ
నీ గూర్చి ఆలోచించమంది.
ఏ భావ తరంగాలు నన్ను కదిలించాయూ
ఎప్పటి నుండో తెలియదు కాని,
మనసుకు మౌన భాష నేర్పింది.
బహుశ దానికి న మనస్సు అర్థమైన్దేమో.
సజల నేత్రాల మధ్య నీ రూపం
మసక భారిన ఆలోచన
మధ్య నిదురబోయింది.కలువ రేకుల వంటి నీ నయనాల లోని కాంతి
నాపై గగన కుసుమాలను వెదజల్లాలని
నీ రాగా మంజిరనాద తరంగిణిలో
ఆదమరచి సేద తీరాలని నీ ప్రతిబింబంన్ని
నా హృదయ దేవాలయంలో ప్రతిష్టించాలని
గడఅంధకారము అలుముకున్ననా హృదయంలో
అమర దీపం వెలిగిస్తవనుకున్నాను,
నన్ను నిరాశపరచకు నేస్తం

కొన్ని ఫన్నీ క్లిప్స్

ఆవు కరాటే చేస్తే యెట్లా ఉంటుందో చూడాలా? చూసి మీ కామెంట్ వ్రాయండి.

13, సెప్టెంబర్ 2009, ఆదివారం

స్విన్ ఫ్లూ

స్వైన్ ప్లు............ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడా వణికిపోతున్నాయి.మరి మన దేశ పరిస్థితి ఏంటి? స్వైన్ ప్లు బయటపడినప్పుడు మన శాస్త్రవేత్తలు దక్షినాది కి వచ్చి ముప్పు లేద్ధన్నారు.ఈ ప్రాంత అధిక ఉష్ణోగ్రతలో వైరస్ బతకదని సెలవిచ్చారు.దాంతో ఈ వ్యాధి పై ప్రభుత్వాలు నిర్లక్షం వహించాయి.ఐతే గత ౩ నెలలుగా జరుగుతున్న పరిస్థితులు ఉహించిన దానికి భిన్నం గా ఉన్నాయి.ఒక్క మన రాష్ట్రంలోనే ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య పది. అలాగే తమిళనాడు లో కూడా మరణాలు సంబవించాయి.
స్వైన్ ప్లు బయటపడిన రోజునుంచి ఎందుకు జాగ్రత్త వహించలేదు?దేశ వ్యాప్తంగా సుమారు వ్యాధి నిర్ధారణ ఐతే ఇప్పటికి తీసుకున్న చర్యలు స్వలమే . నెలలుగా ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్లు?ముందు జాగ్రత్త చర్య గా వైద్యాన్ని ఎందుకు విస్తరిచలేదు?శాంపిల్ హైదరాబాద్ కి పంపి వ్యాధి నిర్ధారించే సరికి పుణ్యకాలం గడిచిపోతున్నది.ప్రాంతాల వారిగా ఎందుకు ల్యాబ్స్ తెరవలేదు?ప్రైవేటు వైద్య సేవలను ఎందుకు వినియోగించుకోలేదు?
రాష్ట్ర నాయకులకు ఎంతసేపు అధికారం వారికీ ఇవ్వాలి ,వీరికి ఇవ్వాలని ధర్నాలు , సంతకాల సేకరణ కార్యక్రమాలతో సరిపోతున్నది.మరి ప్రజల ఆరోగ్యాన్ని ఎవ్వరు పట్టించుకోవాలి?ప్రజల కోసమే మనము ఉన్నదని ఆలోచించే నాయకులూ ఎవ్వరున్నారు?ప్రజలు ఎన్నుకుంటేనే మనము అధికారం లో ఉంటాము, వారికీ కనీస అవసరాలను తిర్చవలసిన భాద్యత మనది అని ఫీల్ అయ్యే నాయకులూ ఏరి?మరి అలంటి వారికీ ప్రజల ధనముతో సుఖాలు అనుభవించే హక్కు లేదు.వారి జీతం, భద్రత సిబ్బంది,ప్రయాణ చార్జీలు అంతే కాకుండా రోగం వస్తే నిమ్స్ లో లేదా అపోలో లో వైద్యానికి కూడా ప్రజలు చెల్లించే పన్నులే.ప్రతి నాయకుడు ప్రభుత్వహాస్పిటల్కి ఎంతో చేసాము. కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాము అంటున్తరేమరి అక్కడ వారు ఎందుకు వైద్యం చేసుకోరు? వీరికి సకల సౌక్యలను కల్పించిన ప్రజలు మాత్రం కనీస అవసరాలకు అష్టకష్టాలు పడుతుంటే ......................... ఆహా నా భారత దేశమ ఇది మా దౌర్బాగ్యం

ఓ అందమా

ప్రేమంటే తెలియని నాకు ప్రేమ రుచి చూపావు,
వాస్తవం లో బ్రతికే నన్ను ఉహలలో విహరిపచేసావు.
నీ చిరునవ్వుతో నన్ను మతిలేని వాణ్ని చేసావు,
నీ వాలు జడతో నన్ను బందిచేసావు,
నీ అందాలకు నన్ను ప్రేమ పూజారిని చేసావు,
నీ నామ స్మరణతో జపమే చేయించావు,
కళ్లు మూసినా కలలో కనిపించి కవ్విస్తావు,
ఇలలో మాత్రం దూరంగా ఉంచి ఇరుకున పెడతావు,
నీ అయస్కాంత చూపులతో నన్ను ఆకర్షిస్తావు,
నీ దరికి చేరెంతలో నేవే దురమౌతవు,
నా హృదయం దోచుకొని నన్ను హృదయం లేని మనిషిని చేసావు,
ఓ ప్రేమ నీకు నా జోహార్లు

చిన్ని కవిత

సముద్రపు అలలను చూసినా చల్లగాలి నన్ను తాకిన
గులాబీ పువ్వు పూసిన మల్లెవాసన తాకిన
మంచుతెరలు చూసినా వాన చినుకు తాకిన
నీవు గుర్తుకు రాని క్షణం లేదు.....తలవని దినము లేదు.

చిన్ని కవిత

శ్రుతి చేసిన వీణ మధుర సంగీతాన్ని ఇస్తుంది.
--ఇది మనసుకు ఆనందం.
నిజమైన స్నేహితుడు అనురాగాన్ని,ఆత్మీయతను పంచుతాడు.
--ఇది జీవితానికే ఆనందం.




@@@@@@@&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&



పరిచయం అనే చెట్టుకి అనురాగం అనే నీరు పోస్తే స్నేహమనే పువ్వు పూస్తుంది



ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది.ప్రేమను ప్రేమించే ప్రేమను ప్రేమ కే ప్రేమించడం నేర్పుతుంది .ప్రేమకే ప్రేమించడం నేర్పే ప్రేమ ప్రేమకు కష్టాలను తెస్తుంది.కష్టాలను తెచ్చె ప్రేమ , కష్టాలను కూడా ప్రేమించే ప్రేమను ప్రేమిస్తంది.కష్టాలను కూడా ప్రేమించే ప్రేమ కొరకు ప్రేమ ఏమైనా చేస్తుంది.

జోక్

'మీ అమ్మ,నాన్నలు రోజు కోట్లడుకుంటారు కదా, మరి నీవు ఎవ్వరి ప్రక్కన ఉంటావు ?'అడిగాడు ఆనంద్.
'ఎవ్వరి ప్రక్కన ఉండను.వాళ్లు విసిరే వస్తుఉలు నాకు తగలకుండా తలుపు ప్రక్కన ఉంటాను.' అన్నాడు అరుణ్.

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

అభిమానం

మన రాష్ట్రము లో ప్రతి నాయకులకు అభిమానులు ఉన్నారు.ఐతే నాయకులూ అభిమానుల్ని అవసరానికి వాడుకోవడం తప్ప వారి బాగోగులు చూసింది లేదు.జన్మనిచ్చిన తల్లి తండ్రి ల క్షేమం చుడరుగాని వారి నాయకులకు దండలు , వారి పుట్టినరోజుకు రోగులకు పండ్లు పంచడం చేస్తారు.ఇంట్లో జ్వరం తో బాధపడే నాన్నకి మాత్ర తిసిచెందుకు తీరిక ఉండదు , నాయకుల మీటింగ్ కి వెళ్లేందుకు కార్లు , బండ్లు వీతికైతే డబ్బులు ఉంటాయి.జన్మనిచ్చి ,పెంచి పెద్ధచేచి ఆస్తులు ఇచ్చే నాన్న కి కష్టం రాకుండా చూడలేరు.ఎవ్వరు బగుపదేందుకు వీరి కష్టార్జితం పెట్టాలా? నాయకుడు చనిపోతే ఎవ్వరికైనా బాధ ఉంటుంది.ఐతే ప్రాణత్యాగం చేయడం ఎంత వరకు సబబు. మీనా నాన్న చనిపోతే నీవు ప్రాణత్యాగం చేస్తావా?మరి ఎవరి కోసమో నీవు చనిపోవడం ఏంటి అర్థం, లేకుండా?ఒక హీరో సినిమా తీస్తాడు.ఆ సినిమా ఓపెనింగ్ రోజు థియటర్ అలంకరించేది మీరు. సినిమా ని ఎక్కువ సార్లు చూసేది మీరు. మరి లాభాలలో ఎంత వాటాఅభిమాన సంగాలకు ఇస్తున్నారు? ఒక్కోసారి టికెట్స్ తీసుకొనేటప్పుడు కరెంటు షాక్ తో చనిపోతే నీ కుటుంబానికి ఎవ్వరు ఆధారం? అబిమానం వెర్రితలలు వేస్తే జరిగేది నష్టాలే , అది నీ వైపు మాత్రమే.
నిన్నటి పేపర్ లో చదివాను ముఖ్యమంత్రి గారి మరణం తరువాత సుమారు ౩౦౦ మంది చనిపోయారని.ఏందిది.అభిమానానికి ఓ హద్దు ఉండాలి.నిన్ను నమ్మిన నీ బార్య , పిల్లలు ఎమౌలి ?ఇప్పుడు , అప్పుడు కింది స్థాయి కార్యకర్తలే చనిపోతారు.అదే మీ పై నాయకుడు చనిపోడే? వారివైతే ప్రాణాలు , మీ వైతే గడ్డి పుల్లలా?దయసేచి మీరు గమనించండి , మీ పై ఆధారపడిన వారిని గుర్తుచేసుకోండి.దయసేచి అగేత్యలు చేయకండి.
ఎవ్వరి కోసం మీరు త్యాగాలు చేయాలి? వారు మీ కూడా పుట్టిన వారా? లేక మీ బాగోడులు చుసేవారా?మంచి కోసం త్యాగం చేయండి. అంతే కాని ఎవ్వరో లాభపడేందుకు మీరు త్యాగాలు చేస్తే మీ కుటుంభం అధోగతి అవుతుంది.
దయ చేసి ఆలోచించండి.చేతనైతే చుట్టుపక్కల వారికి సహాయపడండి.నీ సహాయం పొందిన వారు నిన్ను సదా స్మరించుకుంటారు.మీ నాయకులకు మీమల్ని పట్టించుకొనే తీరిక ఉండదు.కావాలంటే చినిపోయిన వారి పేర్లు కొన్ని చెప్పమనండి.తెలుస్తుంది.

అశ్రూనివాలి

మన రాష్ట్ర ముఖ్య మంత్రి , పేదల అభివృద్ది కోసం నిరంతరము శ్రమించే గొప్ప నాయకుడు ,ఆరోగ్యశ్రీ వరప్రదాత ,జలయజ్ఞం ద్వారా హరితాంధ్ర ప్రదేశ్ రూపశిల్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ యేడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి గారి ఆకస్మిక మరణం యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి దుఖసాగరం
ప్రజల నుంచి ఎదిగి , ప్రజల మధ్య మెదిలి ,ప్రజల వద్దకు పయనమైన రెడ్డి గారు ఆ ప్రజలను చేరకనే వెళ్ళిపోయారు.రచ్చ బండ వద్ద కొలువుధీర వలసిన ముఖ్యమంత్రి ,'ఎవ్వరికి చెప్పకుండా ఆకస్మికమగా వేల్తునానని " చెప్పిన ముఖ్యమంత్రి ఎవ్వరికి చెప్పక ఒంటరిగా వెళ్లి స్వర్గలోక సింహాసనంలో అసీనులినారు.నిత్యం వినూత్న పథకాలతో ,నిరంతరము రైతుల అబ్యున్నతికి పాటుపడే వీరిని చూసి దేవతలకి కన్నుకుట్టిందేమో ?లేక ప్రజలు అభివృద్ది చేన్దితే దేవతలను స్మరించారని అనుమానపడ్డరేమో?లేక దేవేంద్రుని పాలనా విసుగు పుట్టిందేమోమరి రాష్ట్ర ప్రజలను అనాధలుగా వదలి ఆయనను తిసుకోనివేల్లిపోయారు.
అయన అదృశ్యం ఐనప్పటినుంచి లక్షల మంది చేసిన ప్రధానాలు దేవతల చెవి చేరిన వారి స్వార్థంతో నిర్దయగా ఆయన్ను తిసుకోనివేల్లిపోయరే ,వీళ్ళు నిజం గానే దేవతలా?
దేవుళ్ళు నిజంగా ఉంది ఉంటే ఆయన్ను క్షేమంగా తిసుకోనివచ్చి అప్పగించి ఉండేవారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో పదిల స్థానం ఏర్పరుచుకున్న నాయకుడు , తన చిరకాల స్వప్నం ఐన జలయజ్ఞం పూర్తి చేయకనే అనంతలోకాలకు వెళ్ళిపోవడం ఆంధ్ర రాష్ట్ర పరకాల దురదృష్టం.నిన్ను నమ్మిన జనాన్ని కన్నీటికడలిలో వదలి అనంతలోకాలకు పాదయాత్ర చేస్తున్నావా?లక్షల హృదయాల సింహాసనం లో కొలువైన నీవు ఆ దేవేంద్రుని సిహ్మసనమైన వదలి నీ ప్రజల కోసం ఆ స్వర్గనైన దిగిరా.పాదయాత్రతో ఓ మహాప్రస్థానం సృష్టించిన నీవు ,నీ అంతిమ యాత్ర కూడా చరిత్రే . కోట్లాది జనం ఎలుగెత్తి క్షేమంగా నల్లమల అడవులనుంచి రావైయ్యా అన్నారే , మాట తప్పను....మడమ తిప్పాను అన్నవే,అనుకున్నది ప్రళయం వచ్చిన తలవంచని దీరసాలివె నీవు విధి ముందు ఓడిపోవడం ఎంతటి విషాదకరం.
కాంగ్రెస్ కాదు , తెలుగు దేశం కాదు , ప్రజారాజ్యం కాదు అందరి పార్టి ప్రజలు ముక్తకాంతం తో గోశించార్ఈ రావయ్య రాజశేఖర నీవు క్షేమంగా రావయ్య అని . అదిచాలదా నీ జన్మకు సార్థకత.

అరవై సంవత్సరాలకు విరమణ చేస్తానని అనుకోకుండా చెప్పి అట్లే అరవై అవ్వగానే వెళ్ళిపోయవా ? రావయ్యా రాజశేఖర నింగిని చిల్చేకొని ఐన నీ ప్రజల కోసం , రాష్ట్ర ప్రభుత్వ సారధి గా రా...నీలాంటి నాయకుడిని పోగొట్టుకొని ఆంధ్ర రాష్ట్రము సోకసముద్రం లో మునిగిపోయింది.....

నీవెక్కడున్నా మా హృదయాలలో చిరస్థానంగా నిలిచిఉంటావు.మరణం భౌతికంగా గాని నీ ఆత్మ ఎప్పుడు మాపైఉంతుంది.జోహార్ రాజశేఖరా...............................నీవు జన హృదయాలలో అమరుడవు..... రైతుల గుండెచప్పుడు నీవే .............వాన దేవుడు మా పార్టి అని గర్వం గా చెప్పేవే మరి ఆ వాన దేవుడే నిన్ను పొట్టన పెట్టుకున్నదే


1, సెప్టెంబర్ 2009, మంగళవారం

నాయకులూ .............. జనము

మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు.ఈ లక్ష కోట్లు ఎక్కడనుంచి ప్రభుత్వాని ఎక్కడనుంచి వస్తుంది?వచ్చిన డబ్బుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?ఏమి చేయకూడదు?ఇవన్ని అసెంబ్లి లోప్రభుత్వం ఓ సంవస్తరానికి జరుగు ఆదాయము ,ఖర్క్షులు మొదలైన అవసరాలకు అగు మొత్తము సుమారు అంచనా వేసి బడ్జెట్ రూపం లో సభ్యుల ఆమోదం కోరుతూ ప్రవేసపెడుతుంది. సభ్యులందరు బడ్జెట్ ప్రతిని క్షునం గా చదివి లోటుపాట్లు ఉంటే దానిని చర్చించి ఆమోదం తెలపాలి.ఇంత తతంగం జరగవలసిన బడ్జెట్ చర్చ జరుగుతున్న తీరూ చూసి కుడా రాష్ట్ర జనం నాయకులను ఆమోదించడమే అత్యంత విచారకరం.

జోకులు

శిష్యుడు:గురువు గారు పూజ పై ద్రుష్టి సారిచలేకపోతున్నాను.పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.దయచేసి మంచి సలహా ఇవ్వండి.
గురువు:శిష్యపూజను ఇక్కడికి తీసుకొని రా నాయన.ఇద్దరికి తయోత్తు కట్టి దోష నివారణ చేస్తాను.అన్నాడు పరధ్యానం గా.
>>>...........................>>>>>>>>>>>>>>>...............................>......................>>>>>>>>>>>>>..
ఆపిల్ ,ద్రాక్ష , అరటి పళ్ళు ఓ చోట చేరి సాధక బాధలు ముచ్చతిన్చుకొంతున్నై.
ఆపిల్: జనం నన్ను ఇంటికి తీసుకొని వెళ్లి శుబ్రంగా కడిగి కత్తితో కోసుకొని తింటారు.
ద్రాక్ష:నన్ను కూడా కడిగి అలాగే నోట్లో వేసుకొని చప్పరితారు.
అరటి ఏమి చెప్పక పోయేసరికి ఆశ్చర్యంగా చూసాయి.
అరటి:ఏమి చెప్పమంటారు?ఈ దిక్కుమాలిన జనం న బట్టలు విప్పకుండా నన్ను తినలేరు కదా అంది సిగ్గుతో .

వలసలు

ప్రతి సంవస్తరం వేసవిలో అనేక దేశాలలోని పక్షులు విదేశాలకు వలసలు వెళ్ళడం రివాజు.అందుకు కారణం అ దేశం లో తగిన నీటి వసతులు లేక మేత అందుబాటులో లేక పోవడంవల్ల వలసలు వెళ్తుంటాయి.అలాగే మన దేశం లో పల్లె లో వ్యవసాయ పనులు తగ్గినప్పుడు,కరువు వచ్చినప్పుడు వ్యవసాయ కూలీలు కూడా పట్టణాలకు వలసలు వెళ్తుండడంసర్వసాధారణం .
అలాగే మన రాష్ట్రము లో కరువు తీవ్రం గ ఉన్నా పరిస్థితిలో వ్యవసాయ కులిలను ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా వలసల్ని కొద్దిన నివరించింది.కాని మన రాష్ట్రము లోని రాజకీయ నాయకులూ ఓ పార్టి పేరు చెప్పి ఎన్నికల్లో నిలబడి , ప్రజలకు సేవ చేస్తామని ఓట్లు వేయించుకొని,గెలిచి ప్రజల తరపున నిలబడి అన్యాయని నిలదీయవలసిన నాయకులూ వేరే, పార్టి చూపిన ప్రలోభాలకు లొంగడం ఎంత వరకు సమంజసం? టికెట్ ఇచ్చిన పార్టి ని విమర్శించే ముందు , ఆరోజు టికెట్ ఇచ్చిన అధినేత గూర్చి , సిద్ధాంతాల గూర్చి తెలియకుండానే అ పార్టి తరపున నిలబద్దరా?
అభిప్రాయ బేధాలు ఎక్కడైనా ఉంట్టాయి.దాన్ని కలసి చర్చించు కోవాలి గాని విమర్శించడం ఎంత వరకు సమంజసం?
తామందరం గెలిస్తే పార్టి నేత ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారని తెలియదా? పార్టి నేత సరిలేనప్పుడు పోతిచేయకుడదు?
అంటే అ ప్రాంతం లో మేత అధికం ఉందన్న మాట.నైజీరియా నుంచి ఇండియా కు వలస వచ్చే పక్షులు ఎక్కడ అ ప్రాంత న్ని విమర్సిన్చినట్లు ఈ ఒక్కరు చెప్పలేదు.అలాగని ఈ ప్రాంతాన్ని పొగడను లేదు.మరి ఆ పక్షులకున్న జ్ఞానం కూడా మన నాయకులకు లేకపోవడం మన దురద్రుష్టం.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...