25, అక్టోబర్ 2010, సోమవారం

భారత దేశ చట్టం ---- మన దౌర్బాగ్యం.

మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ నాయకులూ కానీ న్యాయ వ్యవస్థని, దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు పలుచన చేస్తుంటే దేశ పౌరులుగా మనము విచారపడటం మినహా చేయగలిగినది ఏముంది?దేశ పౌరులు చేసే చిన్న ,చిన్న నేరాలకు కటిన శిక్షలు అమలు చేసే వ్యవస్థలో విదేశి తీవ్రవాదులకు మాత్రం కోటను కోట్లు ఖర్చు చేస్తూ , ప్రధాన మంత్రి భద్రతో సమానంగా భద్రత కల్పిస్తూ మన దేశానికి వి.ఐ.పి తరహాలో చూడటం మన దౌర్బాగ్యం కాకా మరేంటి?
మన దేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ పై నే దాడి చేసి పది మంది బద్రత సిబ్బందిని పోత్తాన్ పెట్టుకున్న నీచులను , ముంబై మరణ హోమం లో సుమారు 150 మందిని కాల్చిన అత్యంత క్రూరుడైన తివ్రవాధిని , కోర్టు ఉరి శిక్ష విధించిన అమలు చేసే సాహసం చేయని నాయకులూ ఓటు రాజకీయాలతో , అవకాసవాదుల కారణం గా మనదేశంలో తివ్రవాదుల ఆగడాలు సృతిమించుతన్నాయి.కసాబ్ ,అప్జాల్ గురు ఇద్దరిని ఒకే గాటిన పోలుస్తూ వరుస క్రమంలో ఉరి తీస్తారట. ఇదికూడా ఓటు రాజకీయమే. ఇద్దరు ముస్లింలు అయినందున ముస్లిం ల ఓట్లు ఎక్కడ పడవో అని , దేశ భద్రతకన్నా వీళ్ళకి పదవులే మిన్న.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...