13, ఆగస్టు 2011, శనివారం

గురువిందా లక్షణం

నేడు తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్,తెలుగుదేశం పార్టిలు ,రెండు పత్రికలు కుట్ర పన్నుతున్నాయని వాపోతున్న జగన్ కి నాడు తను చేసిన నిర్వాకం ఏమిటో గుర్తుకు రాకపోవడం విచారకరం. రెండు పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలను కోతపెట్టడం,
అనవసర కేసులు పెట్టడం,రెండు రూపాయలకే దినపత్రిక ని ఇవ్వాలని ప్రకటించడం ,ప్రతిపక్షలని నిర్వీర్యం చేయడానికి ఆపరేషన్ ఆకర్ష చేపట్టడం ఇవ్వన్ని జగన్ తెలియకుండా జరిగాయ? తండ్రి అధికారం తో కన్ను మిన్ను తెలియక ప్రవర్తించినప్పుడు , రెండేళ్ళ రాజకీయ అనుభవానికే ముక్యమంత్రి పదవి వారసత్వ హక్కు అని విర్రవీగినప్పుడు తెలియదా పరిస్థితి చేజరినప్పుడు ఈ దుస్తుతి తప్పదని?
నిజానికి కాంగ్రెస్ జగన్ విషయం లో ఎంతో ఓపికతో వ్యవహరించింది. దాన్ని సద్వినియోగం చేసుకోకా , మొండిగా వ్యవహరించి నేటి దుస్థితి కొనితేచ్చుకున్నాడు.వై యస్ ఆర్ పై జాతీయ స్థాయిలో తెలుగుదేశం ఉద్యమమే చేసిన నాడు వై యస్ ఆర్ ని వేనుకేసుకొని వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికి విచారణకు అదేసించలేదు. న్యాయస్థానం చొరవ చుపించాకుంటే ఇప్పటికి దొంగలు బయటపదేవాళ్ళు కారు.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...