28, మే 2012, సోమవారం

Jagan








జగన్ ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖునిచేయడం అంటా? అంటే ఈయనే ప్రజాస్వామ్య పరిరక్షకులా? కాంగ్రెస్ MLA  ల తో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు రావడానికి కారణమైన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించే వ్యక్తా? ఆయన్ని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసినట్లా?ఇంకో రెండు సంవత్సరాలలో ఎన్నికలు రాబోతున్న సంధర్బంలో ఒక్క గొప్పలు చెప్పుకోవడానికి 
తప్ప ఎందుకు పనికిరాని  ఈ టైం లో  తన గొప్పతనం చెప్పుకోవడానికి కొన్ని కోట్ల ప్రజధనము  ధుర్వినియోగించడం ఎంత వరకు సమంజసం? అప్పుడు కడప ఎన్నికలు ,ఇప్పుడు ఈ ఎన్నికలు. వీటన్నిటికి కారణం జగన్. ప్రజాధనం దుర్వినియోగపరచడం  జగన్ , తెలంగాణ రాష్ట్ర సమితి లకు  మాత్రమే  విద్య. మరి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తరతా?ప్రజల కోసం , ప్రజలచేత , ప్రజలతో ఏర్పడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. మరి ఇక్కడ జగన్ కోసం , జగన్ చేత , జగన్తో ఏర్పడే దీన్ని ఏమన్దాము? కచ్చితంగ జగన్ స్వామ్యం.ఈ రాష్ట్ర రక్షణకు దేవుడు పంపిన పరిరక్షకుడే ఈ జగన్ అని జనం విస్వసించాలి కాబోలు .ఈయన పేపరులో వచ్చిందే వార్త , ఈయన గారు చెప్పిందే న్యాయం కాబోలు, అందుకే సాక్షి ఫై చర్య తీసుకుంటే అది పత్రిక స్వేక్షని అడ్డుకోవడం , ఈయని అక్రమాలను విచారిస్తే వేధించడమే. నిజానికి ఇక్కడ కొన్ని అర్థం కాని విషయాలెన్నో ఉన్నాయి.కొండ సురేఖ గారు, హరిరామజోగయ్య గారు, మైసుర రెడ్డి గారు , భుమ నాగిరెడ్డి గారు, సబ్బం హరి గారు ఇత్యదులందరు  ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నవారే. వీళ్ళ రాజకీయ వయస్సు అంత లేని జగన్ వెంట ఎందుకు వేలుతున్నారో అర్థం కావడం లేదు.అదే జగన్ కి అతి ఆత్మవిశ్వాసానికి  కారణం అయి ఉంటుంది.

13, మే 2012, ఆదివారం

Jagan

అన్న జగన్నన్న నీ తెలివి అమోగం.వెబ్ పోల్ నే మార్చివేయగల తెలివి వంతుడవు.ప్రపంచ తెలివి గల వాళ్ళలో నీ స్థానం  బిల్ గేట్స్ కన్నా ముందు నీవే.తప్పు చేసిన ఎదురు దాడి నీ నైజం .నీ గూర్చి తెలియని అమాయకులు మాత్రమే నీ పై  విమర్శలు చేస్తున్నారు.నిన్ను అర్థం చేసుకుంటే దేశం లో పేదవారు ఎత్తి పరిస్థితిలో ఉండరు.నీ చరిత్ర  అవినీతికి ఓ భగవత్గీత. నీ మాట అవినీతికి పూలబాట.ఇది నేను చెబుతున్న మాట కాదు.ప్రతి రోజు నీ గూర్చి వస్తున్న వార్తల 
ఆధారంగా చెబుతున్న మాట. మీ నాన్న పెధవరినంధరిని లక్షాధికారులను చేస్తానని చెప్పేవారు. కుమారున్ని మాత్రం కోటీశ్వరున్ని చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. అవినీతి ఒక్కడే చేయగలడా?  కొంతమంది కలిస్తేనే కదా? మరి వాళ్ళకు బాగం లేకుండా ఉంటుందా? మరి వాళ్ళు ప్రజలలో భాగం కదా ? మరి వాళ్ళు అబివృద్ధి చెందితే ప్రజలు అబివృద్ధి చెందడం కాదా?  మరి ప్రజలు అభివృద్ధి చెందితే నాయకులకు ఎందుకు మంట.వీళ్ళు వృద్ధి చెందరు , చెందే వాళ్ళను చూస్తే కడుపు మంట.

11, మే 2012, శుక్రవారం

అమ్మ జగను ఏమి తెలివి










జగన్న కి బ్లాకు డే అంట . అవినీతికి  బ్లాకు డే నా లేక జగన్నన్నకి బ్లాకు డే నా? నాడు ఆంద్ర జ్యోతికి , ఈనాడు కి బ్లాకు డే రోజు ఎందుకు వాళ్ళ నాన్నకి చెప్పాలేదు? మనం చేస్తే తప్పు లేదు బైట వాళ్ళు చేస్తే తప్పా? భూమి గుండ్రం గా తిరుగుతుంది, ఏదో ఓ రోజు మొదలు పెట్టిన స్థలనికే వస్తుందని తెలియదా?నాడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? తన తండ్రి చెప్పిన సూక్తులు మర్చిపోయావా? లేదా అవసరానికి వదిలేసవా? 
కొత్త గా ఓ వాదన లేవదీసి జగన్నన్న తను అనుకున్నదే సరియినదిని అనుకుంటున్నాడు. సాక్షి పై కక్ష సాధింపు అని
 పత్రిక స్వేచ్చకి భంగం అని వితండ వాదం చేస్తుండడం చూస్తే ఉప ఎన్నికలకి సానుభూతి పొందడమే తన లక్ష్యం గా కనబడుతున్నది.
నాడు ఓ గ్రామా సేవకుడిని బ్యానరు తొలగించినందుకు చితక బాధినప్పుడు వ్యక్తి గత స్వేచ్చ గుర్తుకు రాలేదా?  ఓ మత్స్యకరున్నిపై దాడి జరిగినప్పుడు ప్రజల స్వేచ్చ గుర్తుకు రాలేదా? నిన్న ఓ యువకున్ని భాదిన్నప్పుడు గుర్తుకురాలేదా?

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...