21, అక్టోబర్ 2010, గురువారం

రాయలు సమర్పించిన నగలు


శ్రీ కృష్ణ దేవరాయలు 1489 లో జన్మించి 1509 లో చక్రవర్తి గా ప్రకటింపబడి కృష్ణ అష్టమి నాడు పట్టబిశాక్తుడైనాడు.1529 - ౩౦ మధ్యకాలం లో అస్తమించాడు.కేవలం 20 సం..లు మాత్రమే పరిపాలన చేసిన అనంత కీర్తిని, ప్రతిష్టలు సంపాదిన్చుకున్నాడు.1509 ఆగస్ట్ 8 న పట్టబిశాక్తుడైన తరువాత 1513 ఫిబ్రవరి 10 న ఇద్దరు దేవేరులతో కలసి మొదటిసారి స్వామిని దర్శించుకొని నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటం,మూడు సరాలలో ముత్యాలు పొదిగిన కంటాహారం, పతకం లో ఐదు విధాలైన రత్నాలు పొదగబడిన విలువైన 15 బంగారు కంట అబరణలు,కర్పురదీపరధన నిమితం ఒక వెండిహారతి పళ్ళెం ను చిన్నాదీవి స్వామి పాలారగింపు సేవకు ఒక బంగారు గిన్నె , తిరుమల దేవి ఒక బంగారు గిన్నె సుగంధధ్రవ్యలను పెత్తుకోవదానికి ఒక బంగారు గిన్నె కానుకగా సమర్పించారు.1513 మే 12 న ఒక్కడే తిరుమలకు విచ్చేసి ఉత్సవ విగ్రహానికి , భూదేవి ,శ్రీదేవి విగ్రహాలకు వజ్రాలు ,రత్నాలు పొదిగిన చిన్న బంగారు కిరీటాలను బహుమతిగా ఇచ్చారు. జూన్ 13 నాడు తల్లి తండ్రుల జ్ఞాపకార్థం నవరత్నాలు podigina ఆభరణాలు, ఒక పెద్ద బంగారు గిన్నె ను సమర్పించారు.గోడగారనాడు (తిరుపతి ప్రక్కన గల గ్రామాలకు గోడగారనాడు అన్నది ఆనతి పేరు) లోని చత్ర వాడి,తురూరుకరికం బడి అనే గ్రామాలను ధరధతం చేసాడు.1514 జూలై 7 న మరోసారి స్వామి సన్నిధికి వేంచేసారు. స్వామివారికి 30,000 వరహాలతో కనకాబిషేకం ,ముత్యాలు,పద్మ రాగాలు ,మరకతాలు పొదిగిన మూడు సరళ బంగారు ఆభరణాలను,వజ్రాలు పొదిగిన ఒక జత బంగారు కదియలను, కడప జిల్లా లోని తాలపాక గ్రామమని నిత్య నైవేద్యాల నిమిత్తం ధారాదత్తం చేసాడు.చిన్న దేవమ్మ స్వామికి ఒక పతాకాన్ని , ఒక కన్తమలను కానుకగా సమర్పించారు.తిరుమల దేవమ్మ వజ్రాలు , పద్మరాగాలు,పచ్చలు ముత్యాలు పొదిగిన బంగారు పతాకాన్ని కానుకగా ఇచ్చారు.యువ నమ సంవత్సరం కార్తిక భాహుల తదియ నాడు 1515 అక్టోబర్ 25 న రాయలు రాజధానిలో ఉండే స్వామికి నవరత్నప్రబవాలి నే మకరతోరణాన్ని సమర్పించినట్లు తెలుస్తోంది. మారక తోరణం బరువు సుమారు 31,124 వరహాలు.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...